వైసీపీ పార్టీకి చెందిన నేత పంచకర్ల రమేష్( Panchkarla Ramesh ) నేడు జనసేనలో జాయిన్ అయ్యారు.మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి రమేష్ ని జనసేనలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రమేష్ తనకు కుటుంబ సభ్యుడు లాంటి వారని చెప్పుకొచ్చారు.జనసేనలో ( Janasena )రమేష్ కి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇక ఇదే సమయంలో పంచకర్ల రమేష్ మాట్లాడుతూ.ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేస్తున్న ప్రజల కోసం పవన్ భరిస్తున్నారు.
ఆయన ఆశయాల కోసం జీవితాంతం తోడుగా ఉంటానని స్పష్టం చేశారు.పంచకర్ల రమేష్ గతంలో విశాఖ వైసీపీ( YCP ) జిల్లా ఇన్చార్జిగా పనిచేశారు.అంతకుముందు ప్రజారాజ్యం, టీడీపీ( Praja Rajyam, TDP ) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం ఎన్నికల పోరులో పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితంగా రమేష్ మెలగడం జరిగింది.
కాగా 2019లో వైసీపీలో జాయిన్ అయినా ఆయన తాజాగా జనసేన పార్టీలో చేరారు.పవన్ ఇటీవల చేపట్టిన వారాహి విజయయాత్ర తర్వాత ఆ పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో జనసేన నేతలు ఫుల్ సంతోషంగా ఉన్నారు.