ఈనెల 22న మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం

మచిలీపట్నం పోర్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని మంత్రి రోజా తెలిపారు.ఈ మేరకు ఈనెల 22న సీఎం జగన్ ఆ పనులను ప్రారంభిస్తారన్నారు.

 Machilipatnam Port Works Will Start On 22nd Of This Month-TeluguStop.com

ముందుగా గుడివాడలోని తొమ్మిది వేల టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.తరువాత మచిలీపట్నం పోర్టు పనులకు ఆయన భూమి పూజ చేస్తారని మంత్రి రోజా వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే మచిలీపట్నంలో 2,145 టిడ్కో ఇళ్లను ప్రజలకు అందిస్తారని చెప్పారు.టీడీపీ హయాంలో ఎన్నికల ముందు భూమి పూజ చేసి వదిలేశారని మండిపడ్డారు.

జగన్ భూమి పూజ చేసిన ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేశారని వెల్లడించారు.చంద్రబాబు ఎక్కడెక్కడో సెల్ఫీలు దిగుతారన్న మంత్రి రోజా ఇప్పుడు గుడివాడలో నిర్మించిన టిడ్కో గృహాల దగ్గరకు వచ్చి నాని అన్నతో సెల్ఫీ దిగే దమ్ముందా అని ప్రశ్నించారు.

నాలుగేళ్లలో నాలుగు పోర్టులు తీసుకొచ్చిన ఘనత జగన్ ది అని రోజా కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube