నంద్యాల జిల్లా డోన్ మండలం మల్లంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది.
శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ఘర్షణ జరిగిందని తెలుస్తోంది.ఈ క్రమంలో కర్రలు, రాళ్లతో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పర దాడులు చేసుకున్నారు.
ఈ వివాదంలో ఏడుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.గాయపడిన వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారని సమాచారం.