పెట్రల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు.అయితే వాటిని ఛార్జింగ్ పెట్టుకోవడం ఓ సమస్యగా మారింది.
కాలిఫోర్నియా స్టార్ట్-అప్ ఆప్టెరా మోటార్స్ ఓ అడుగు ముందుకు వేసింది.తన “నెవర్ ఛార్జ్” సోలార్ ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
ఇటీవలే మూడు ఆల్ఫా మోడల్లను టెస్ట్ ట్రాక్లో ప్రయత్నించింది.ఫ్యూచరిస్టిక్-లుకింగ్ త్రీ-వీల్ ఆప్టెరా 2020 చివరిలో ఆవిష్కరించారు.
తేలికపాటి నిర్మాణం, తక్కువ-డ్రాగ్ ఏరోడైనమిక్స్ మరియు కూలింగ్, మెటీరియల్ సైన్స్, తయారీ ప్రక్రియలలో పురోగతులు సాధించింది.అంతేకాకుండా ఛార్జింగ్ అవసరం లేకుండా దానికి సోలార్ ప్యానెల్ అమర్చింది.
కస్టమర్లు మెచ్చేలా చక్కటి వాహనాన్ని రూపొందించింది.
వాస్తవానికి ఈ కారు సోలార్ ప్యానెల్ ద్వారా ఛార్జింగ్ పొందుతుంది.దీనికి ప్రత్యేకించి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు.అయితే సౌర ఫలకాల నుండి రోజుకు 70-కిలోమీటర్ల రేంజి అందుతుంది.
అలా తగినంత విద్యుత్ను ఉత్పత్తి చేయగలదని ఆప్టెరా పేర్కొంది.సంస్థ సహ వ్యవస్థాపకుడు క్రిస్ ఆంథోనీ దీనిపై స్పందించారు.“మా అంతర్నిర్మిత సౌర శ్రేణి మీ బ్యాటరీ ప్యాక్ను అగ్రస్థానంలో ఉంచుతుంది.ఛార్జింగ్ పెట్టకుండానే మీరు చక్కగా ప్రయాణించవచ్చు” అని పేర్కొన్నారు.
ఇటీవలి ట్రాక్ టెస్ట్ సందర్శనను హైలైట్ చేయడానికి ఆప్టెరా ఇటీవల తన సోషల్ మీడియా ఛానెల్లను వినియోగించుకుంది.దాని మూడు సొగసైన ఆల్ఫా మోడల్లను, ఇప్పటికీ ఉత్పత్తిలో ఉన్న బీటా మోడల్ను పరిచయం చేసింది.దీంతో ఈ మోడల్ లపై ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. పెట్రోల్/డీజిల్ కార్లకు ఇంధనం నిమిత్తం అధిక ఖర్చును ప్రజలు పెట్టలేకపోతున్నారు.మరో వైపు ఎలక్ట్రిక్ కార్లు తీసుకొచ్చినా వాటికి ఛార్జింగ్ ఓ సమస్యగా మారుతోంది.ఈ తరుణంలో సోలార్ ప్యానెల్స్ అమర్చిన ఈ కార్లు మార్కెట్ లో గేమ్ ఛేంజర్లుగా మారుతాయనే అంచనాలు ఉన్నాయి.
కాకపోతే వీటి ధర కొంచెం ఎక్కువగా ఉంది.రూ.27 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు వీటి ధర ఉండే అవకాశం ఉంది.