టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా ఇటీవలె సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాతో పాటు ఒక్కరోజు గ్యాప్ తో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదలైన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు కలెక్షన్ లను సాధిస్తూ దూసుకుపోతున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా పలవాసక్తికర విషయాలను వెల్లడించారు గోపీచంద్.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.
వీర సింహారెడ్డి సినిమా విషయంలో మొదటి నుంచే కాన్ఫిడెంట్ గా ఉన్నాను.అందుకే సంక్రాంతికి రెండు సినిమాలు విడుదలై మంచి హిట్ సాధిస్తాయి తెలుసు.
సినిమా పై ఉండే పిచ్చి తోనే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను.అందుకే ఇంటర్ కూడా పూర్తి కాలేదు అని నవ్వుతూ తెలిపాడు గోపీచంద్.
వీర సింహారెడ్డి సినిమాలో పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా డైలాగ్స్ ఉన్నాయి అంటున్నారు అంటూ ఆ విషయం పై స్పందించిన గోపీచంద్ డైలాగులు ఇంటెన్షనల్ గా పెట్టలేదని తెలిపారు.అనంతరం మెగాస్టార్ చిరంజీవితో జరిగిన ఒక అరుదైన సంఘటనని గోపీచంద్ రివీల్ చేశారు.నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ షూటింగ్ లోకేషన్ లో జరుగుతున్నాయి.అక్కడికి అల్లు అరవింద్ గారితో పాటు చిరంజీవి గారు కూడా వచ్చారు.
బర్త్డే గిఫ్ట్ గా నాకు చిరంజీవి గారు వాచ్ ఇచ్చారు.ఈరోజు నుంచి నీ టైం మారుతుంది చూడు అని తెలిపారు అంటూ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు గోపీచంద్.అనంతరం రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా పారితోషికం వివాదం విషయం గురించి స్పందిస్తూ.తనకు ఇప్పటివరకు ఏ సినిమాకు పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని మొట్టమొదటిసారిగా తాను పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా వీర సింహారెడ్డి అని చెప్పుకొచ్చారు గోపీచంద్ మలినేని.