తెలుగు సినీ ప్రేక్షకులకు డాన్స్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట ద్వారా ఫేమ్ సంపాదించారు.అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు.
ఇకపోతే ఆట సందీప్ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి పాటలకు సందీప్ స్టెప్పులను ఇరగదీస్తు ఉంటాడు.
ఆట సందీప్ తో పాటు అతని భార్య జ్యోతి ఇద్దరు కలసి కొన్ని వందల డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ట్రెండింగ్ సాంగ్స్ కీ కూడా డాన్స్ స్టెప్పులు వేస్తూ ఇరగదీస్తూ ఉంటారు.టిక్ టాక్లో అయితే వారి డాన్స్ తో ఒక ఊపు ఊపేసిన ఈ జంట ఇప్పుడు ఇన్ స్టా రీల్ వీడియోలు, ఫేస్ బుక్లోనూ డ్యాన్స్ వీడియోాలతో అదరగొడుతుంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఆట సందీప్ హైదరాబాద్లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు.
ఇదే విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.ఇటీవలే ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు సందీప్ తెలిపారు.
అయితే కొవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు.ఇది తమ ఐదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా తాజాగా ఆట సందీప్, జోతి కొనుగోలు చేసిన ఇళ్ళు 10 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా టైంలో పడిన కష్టాలను వివరిస్తూ తన ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు.అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆట సందీప్, జ్యోతిరాజ్.ఇక ఆ వీడియోని చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఉండగా మరి కొంతమంది జీవితంలో ఇంకా పైకి ఎదగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా ఆట సందీప్ ఆట షోలో విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.