సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు కృష్ణ మరణం తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాజాగా ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవరావు మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
కృష్ణ చనిపోవడానికి రెండు రోజుల ముందు కలలోకి వచ్చాడని మాధవరావు తెలిపారు.మహేష్ మేకప్ మేన్ పట్టాభి మా చెల్లెలి కొడుకు అని తెలిపారు.
పట్టాభి డ్రాయింగ్ బాగా వేస్తాడని ఆయన తెలిపారు.నా శిష్యులు చాలామంది హీరోలకు మేకప్ మేన్లుగా పని చేస్తున్నారని మాధవరావు అన్నారు.కృష్ణగారిని చివరగా ఆయన చనిపోవడానికి రెండు రోజుల ముందు కలిశానని తెలిపారు.నాకు కలలు ఎక్కువగా వస్తాయని ఆయన తెలిపారు.
నా భార్య కూడా కృష్ణ కుటుంబంలో మెంబర్ లా ఉండేవారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
విజయనిర్మల గారు, కృష్ణగారు నా కలలోకి వచ్చేవారని మాధవరావు అన్నారు.
చనిపోవడానికి రెండు రోజుల ముందు కృష్ణగారు కలలోకి వచ్చి దూకవయ్యా.! దూకవయ్యా అని అన్నారని ఆయన వెల్లడించారు.కృష్ణగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత నేను వెంటనే ఆస్పత్రికి వెళ్లిపోయానని మాధవరావు చెప్పుకొచ్చారు.విజయనిర్మల మరణం తర్వాత కృష్ణగారు చాలా బాధ పడ్డారని ఆయన తెలిపారు.
ఆయన చనిపోయిన తర్వాత కృష్ణగారి గొప్పదనం తెలిసిందని మాధవరావు చెప్పుకొచ్చారు.కృష్ణగారి గొప్పదనం గురించి మాధవరావు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సీనియర్ ఎన్టీఆర్ గారితో కూడా పలు సినిమాలకు పని చేశానని ఆయన తెలిపారు.కృష్ణకు అత్యంత సన్నిహితులలో మాధవరావు కూడా ఒకరు.కృష్ణ గొప్పదనం గురించి మాధవరావు చెప్పిన విషయాలు విన్న అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ టాలెంట్ ను మరింత మెచ్చుకుంటున్నారు.కృష్ణ మరణించినా అభిమానుల హృదయాల్లో ఆయన జీవించే ఉన్నారు.