జగనన్న ఇళ్లపై పవన్ విమర్శలకు మంత్రి బొత్స కౌంటర్

ఏపీలో ఇళ్లు లేని నిరుపేదల కోసం సీఎం జగన్ పాటు పడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.జగనన్న ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు.

 Minister Botsa Counters Pawan's Criticism Of Jagananna's Houses-TeluguStop.com

గతంలో వైఎస్ఆర్ పేదలకు ఇళ్ల నిర్మాణం మహాయజ్ఞంలా చేపట్టారన్నారు.దాన్నే సీఎం జగన్ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.71 వేల ఎకరాల భూమి సేకరించి ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు.ఇప్పటివరకు రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.

నిస్వార్థంగా, కమిట్ మెంట్ తో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని రాజకీయ పార్టీగా భావించడం లేదని స్పష్టం చేశారు.రూ.15 వేల కోట్ల అవినీతి జరిగిందని పవన్ ఆరోపిస్తున్నారన్నారు.కానీ తప్పుడు ఆరోపణలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube