తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పవర్ ఎక్స్ఛేంజ్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.దీనిలో భాగంగా విద్యుత్ సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు కేంద్రం పవర్ ఎక్స్ఛేంజ్ ను నిలిపివేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.హైకోర్టులో స్టే ఉన్నా విద్యుత్ కొనుగోలు చేయవద్దనడం బాధాకరమని వ్యాఖ్యనించారు.