నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు.దీనిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.ముందుగా మర్రిగూడ బైపాస్ జంక్షన్, క్లాక్ టవర్ సెంటర్ ను ప్రారంభించారు.100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం మునుగోడులో టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.బీజేపీపై కేసీఆర్ ది రాజీలేని పోరాటమని, కేంద్రం అసమర్థ పాలనను ఎండగట్టడంలో ఆయన చిత్తశుద్ధితో ఉన్నారన్నారు.
మునుగోడు అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని చెప్పారు.బీజేపీపై పోరాటానికి వామపక్షాలు కలిసి వస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.