సూపర్ స్టార్ మహేష్ బాబు 46 ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ అండ్ యంగ్ చార్మింగ్ లుక్ తో అమ్మాయిలను ఫ్లాట్ చేయడంలో ముందు వరుసలో ఉన్నాడు.అంతలా తన కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో ఈయన మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఇటీవలే మహేష్ నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుని సూపర్ హిట్ టాక్ తో వసూళ్ల పరంగా కూడా దుమ్ము లేపింది.
ఇక ఈయన క్రేజ్ దృష్ట్యా ఈయనతో నటించడానికి ఏ హీరోయిన్ అయినా వెనకడుగు వేయదు.అంతలా సూపర్ స్టార్ మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు.మహేష్ బాబు సర్కారు సక్సెస్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేసారు.
ఈ సినిమాను ఆగష్టులో సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నట్టు.
అలాగే వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి అందరిని సర్ప్రైజ్ చేసారు.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరొక యంగ్ బ్యూటీ కూడా భాగం కానున్నట్టు టాక్ బయటకు వచ్చింది.
పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుని కొద్దీ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల.ఈమె అందం, అభినయం, డ్యాన్స్ ప్రతీ ఒక్కరిని మెస్మైరైజ్ చేసారు.
ఇక ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశం అందుకున్న ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు త్రివిక్రమ్, మహేష్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించనుందట.
ఈ సినిమాలో మహేష్ బాబు మరదలు పాత్రలో ఈమె నటించ బోతుంది అని వీరిద్దరిపై ఒక సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తుంది.మొత్తానికి మహేష్ తో నటించాలనే కోరిక ఇటు శ్రీలీలకు కూడా తీరిపోనుంది.