తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులతో సంచలనంగా మారుతున్న విషయం తెలిసిందే.అయితే బీజేపీ టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ నేడు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి.
గిరిజనుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు గిరిజనులు, గిరిజన సంఘాలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే.అయితే ఈ ముట్టడిపై నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
గిరిజన రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన మాట వాస్తవమేనని టీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడటంతో ఇక బీజేపీ శ్రేణులు సైతం ఒక్కసారిగా ఖంగుతిన్న పరిస్థితి ఉంది.
అయితే అందులో కేంద్రం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చిందా అని ఈటెల ప్రశ్నించారు.
అయితే బీజేపీ నేతలందరూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సమర్థిస్తున్న తరుణంలో ఈటెల బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడంతో మిగతా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అబద్ధం అనే సంకేతాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పట్ల పెద్ద ఎత్తున ప్రతి అంశం పట్ల వ్యతిరేకతను పెంపొందిస్తూ ఉన్న బీజేపీ ఇప్పుడు కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్రంలో నష్టపోయే అవకాశం ఉంది.
ప్రజలు తిరగబడే అవకాశం కూడా ఉంది.అయితే ఈటెల తాను చేసిన వ్యాఖ్యలను తరువాత సమర్థించుకునే ప్రయత్నం చేసినా కేంద్ర మంత్రికి మద్దతుగా చేసిన బీజేపీ నేతలు మాత్రం తప్పక సమాధానమివ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది.
ఈ ఇష్యూని టీఆర్ఎస్ మరింత ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉండనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాల్సి ఉంది.