సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు గత రెండు సంవత్సరాల నుంచి ఒక్కొక్కరుగా వివాహం చేసుకుంటూ వారి వైవాహిక జీవితంలో స్థిర పడి పోతున్నారు.గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటున్న కొన్ని ప్రేమపక్షులు కరోనా కారణం వల్ల వైవాహిక బంధం వైపు అడుగులు వేస్తూ పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో ఒకటి అవుతున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో జంటలు మూడుముళ్ల బంధంతో ఒకటి కాగా తాజాగా ఈ ఏడాది మరో ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది.
2016వ సంవత్సరంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన “సాహసం శ్వాసగా సాగిపో” అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మంజిమా మోహన్.ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.ఈ క్రమంలోనే తాజాగా ఈమె నటించిన “ఎఫ్ఐఆర్” ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాల నుంచి తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ తో మంజిమా ప్రేమలో ఉన్నారు.2019 లో విడుదలైన “దేవరత్తం” సినిమా ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిందని ఆ ప్రేమ ఈ ఏడాది పెళ్లి పీటల వరకు వెళ్తుందని చెప్పాలి.ఈ విధంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒకటి కానున్నట్లు తెలుస్తోంది.ఇన్ని రోజులు రిలేషన్ లో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడిన ఈ జంట చివరికి వారి రిలేషన్ గురించి బయట పెట్టారు.ఇప్పటికే వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే వీరు పెళ్లి గురించి అధికారికంగా తెలియజేయునునట్లు తెలుస్తోంది.