బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కంగనా రనౌత్ లాక్ అప్ అనే ఒక రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ షోకి నిర్మాతగా ఏక్తాకపూర్ వ్యవహరిస్తోంది.ఈ షో ఎంఎక్స్ ప్లేయర్ లో ప్రసారం కానుంది.
ఈ షో లో 16 మంది వివాదాస్పద సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ షోకి బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ అయిన పూనం పాండే,రోహ్మాన్ షాల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ షోకి సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు షో నిర్వాహకులు.
అందుకు సంబంధించిన వీడియోని కంగానా తన ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.
నా జైలు ఈ విధంగానే ఉంటుంది.గుండాయిజం మీ నాన్న డబ్బులు ఇక్కడ పని చేయవు.
అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ ను జోడించింది.ఇక ఈ వీడియోలో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించారు.
అయితే మామూలుగా అమెరికాలో ఉన్న ఖైదీలు మాత్రమే ఈ కలర్ డ్రెస్ లు ధరిస్తారు.టీజర్ లో తన వ్యక్తిగత జీవితంలోని న్యాయం పోరాటాలను కాంట్రవర్సీ లను గుర్తు చేసుకుంటూ ఇంట్రడక్షన్ ఇచ్చింది ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్.
ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు కలిగి ఉంటారు.అందులో మొదటి వారు నాలాగా ఉండేవారు.ఇంకొందరు మాత్రం బి గ్రేడ్ స్ట్రగులర్స్.ఈ స్ట్రగులర్స్ ఎప్పుడూ నన్ను తిడుతూ వార్తల్లో ఉంటారు.
అంతే కాకుండా నెపోటిజం వంటి అంశాలపై నేను మాట్లాడకుండా నా గొంతు నొప్పి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చింది.అదే విధంగా ఆమెకు వ్యతిరేకంగా వాళ్లు ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేశారని, ఇప్పుడు తనకు సమయం వచ్చిందని,తన జీవితం రియాల్టీ షో గా మారింది అని కంగానా చెప్పుకొచ్చింది.ఇది నా జైలు.ఇందులో నేను చెప్పిన రూల్స్ మాత్రమే ఉంటాయి.ఈ జైలులో 16 మంది వివాదాస్పద సెలబ్రిటీలను బంధించాను.నేను వారిని ఏం చేయాలి అనుకుంటే అది చేస్తాను.
బాప్ ఆఫ్ ఆల్ రియాల్టీ షోస్ ను మీ ముందుకు తీసుకు వస్తున్నాను అని తెలిపింది.ఈ రియాలిటీ షోకు సంబంధించిన ట్రైలర్ను ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నారు.
ఈ షో ఫిబ్రవరి 27నుంచి ఎఏల్టీ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్లో ప్రసారం కానుంది.