గుంటూరు జిల్లా సాగర్ కుడి కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల సమీపంలోని సాగర్ కుడి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.ప్రమాదంలో మదన్‌మోహన్‌రెడ్డి భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష మృతి చెందారు.

 Two Died In Car Accident Rashes Into Sagar Right Canal In Guntur District Detail-TeluguStop.com

మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు సాగర్ కుడి కాల్వలోకి కారు దూసుకెళ్లింది.ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులు ఇద్దరు గల్లంతయ్యారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో.దుస్తుల కొనుగోలుకు మదన్‌మోహనరెడ్డి.భార్య, కుమార్తెతో కలిసి ఉదయం విజయవాడ వెళ్లారు.తిరుగు ప్రయాణంలో.

అడిగొప్పల దాటాక ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.

కారు నడుపుతున్న మదన్‌మోహనరెడ్డి అతి కష్టం మీద ఈదుకుంటూ బయటకు రాగలిగారు.

నీటి ప్రవాహ ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది.ప్రమాదంలో మదన్‌మోహనరెడ్డి భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు కారు కోసం.చర్యల్లో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube