గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల సమీపంలోని సాగర్ కుడి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.ప్రమాదంలో మదన్మోహన్రెడ్డి భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష మృతి చెందారు.
మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు సాగర్ కుడి కాల్వలోకి కారు దూసుకెళ్లింది.ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్మోహన్రెడ్డి కుటుంబసభ్యులు ఇద్దరు గల్లంతయ్యారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో.దుస్తుల కొనుగోలుకు మదన్మోహనరెడ్డి.భార్య, కుమార్తెతో కలిసి ఉదయం విజయవాడ వెళ్లారు.తిరుగు ప్రయాణంలో.
అడిగొప్పల దాటాక ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.
కారు నడుపుతున్న మదన్మోహనరెడ్డి అతి కష్టం మీద ఈదుకుంటూ బయటకు రాగలిగారు.
నీటి ప్రవాహ ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది.ప్రమాదంలో మదన్మోహనరెడ్డి భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు కారు కోసం.చర్యల్లో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి