శ్వాస ఉన్నంత కాలం వైఎస్ జగన్ తోనే..

మనందరి శ్వాస ఉన్నంత కాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ప్రయానిద్దామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు.తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో, నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 49 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

 Mla Bhumana Karunakara Reddy At Cm Jagan Birthday Celebrations , Tirupathi Mla,-TeluguStop.com

భూమన అభినయ్ తో పాటు అతని సోదరుడు నిహార్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరికి రక్త దానం చేసి ప్రాణాలను కాపాడారు.భూమన అభినయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్త దాన శిబిరంలో సుమారు 2,000 మంది పాల్గొని, రక్తదానం చేశారు.

ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కేక్ కట్ చేసి, వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.భారతదేశంలోనే ధైర్యశాలి గా వైఎస్ జగన్ నిలబడ్డారని కొనియాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టిన రోజు వైసీపీ అభిమానులకు పండుగ రోజు అని అన్నారు.

MLA Bhumana Karunakara Reddy at CM Jagan Birthday Celebrations

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube