మనందరి శ్వాస ఉన్నంత కాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ప్రయానిద్దామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు.తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో, నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 49 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
భూమన అభినయ్ తో పాటు అతని సోదరుడు నిహార్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరికి రక్త దానం చేసి ప్రాణాలను కాపాడారు.భూమన అభినయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్త దాన శిబిరంలో సుమారు 2,000 మంది పాల్గొని, రక్తదానం చేశారు.
ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కేక్ కట్ చేసి, వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.భారతదేశంలోనే ధైర్యశాలి గా వైఎస్ జగన్ నిలబడ్డారని కొనియాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టిన రోజు వైసీపీ అభిమానులకు పండుగ రోజు అని అన్నారు.