కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండడంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని దర్శక నిర్మాతలు భావించారు.అదేవిధంగా సినిమాలు కూడా వరుసగా థియేటర్లలో రిలీజ్ అవుతూ కలకలలాడుతూ ఉంటాయని ప్రేక్షకులు భావించారు.
కానీ కొన్ని సినిమాలు థియేటర్లలో, కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల అవుతుండటంతో దీనికి అదే స్పెషల్ కంటెంట్ తో రెండు సత్తాను చాటుతున్నాయి.థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కూడా కొద్దిరోజులకే ఓటీటీకి రావడం సర్వసాధారణం అయిపోయింది.
మరి ఈ డిసెంబర్ లో మన ముందుకు ఏ సినిమాలు రాబోతున్నాయి తెలుసుకుందాం.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.
మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మరక్కార్ సినిమా డిసెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది.ఇందులో కీర్తి సురేష్ సుహాసిని,కల్యాణీ ప్రియదర్శన్, అర్జున్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఆర్ ఎక్స్ 100 సినిమా తెలుగులో ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాను తడప్ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశారు.ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.సుతారియా హీరోయిన్ గా నటించింది.హీరోయిన్ పూర్ణ ముఖ్యపాత్రల్లో నటించిన బ్యాక్ డోర్ సినిమా డిసెంబర్ 3న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా స్కైలాబ్.
ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.