యంగ్ హీరో నాని నటించిన టక్ జగదీష్ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యింది.అంతకు ముందు నాని నటించిన వి సినిమా కూడా థియేటర్ల లేమి కారణంగా ఓటీటీ లోనే విడుదల అయ్యింది.
వి సినిమా విడుదల అయిన సమయంలో పరిస్థితులు అనుకూలంగా లేవు.పూర్తిగా థియేటర్లు మూత పడి ఉన్నాయి.
కాని టక్ జగదీష్ సమయంలో కాస్త థియేటర్లు ఓపెన్ ఉన్నాయి.కాని జనాలు ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లకు క్యూ కడుతున్న దాఖలాలు లేవు.
అందుకే టక్ జగదీష్ ను కూడా ఓటీటీ లో విడుదల చేయాలని భావించారు.ఆ విషయంలో కొందరు బయ్యర్లు మరియు డిస్ట్రి బ్యూటర్లు నాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
నాని ని బహిష్కరించాలి అన్నంతగా డిమాండ్ చేశారు.వారు ఆ సమయంలో నానిపై చేసిన వ్యాఖ్యలకు ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.
కాని అప్పటికే నాని చాలా బాధ పడ్డాడు.తన వల్లే సినిమా ఓటీటీ కి వెళ్లిందని వారు చేసిన వ్యాఖ్యలు నానికి ఇబ్బంది కలిగించాయి.
నాని టక్ జగదీష్ సమయంలో థియేటర్లు పూర్తి స్థాయిలో లేవు.అయినా కూడా కొందరు విమర్శించారు.కాని ఇప్పుడు పూర్తి స్థాయిలో థియేటర్లు సినిమాల కోసం సిద్దంగా ఉన్నాయి.కాని దృశ్యం 2 మాత్రం థియేటర్ల ద్వారా విడుదల అవ్వడం లేదు.ఈ సమయంలో ఎవరు కూడా నోరు మెదపడం లేదు.పెద్ద హీరో సినిమా అది కూడా సక్సెస్ మూవీకి సీక్వెల్ అయిన దృశ్యం 2 థియేటర్ల ద్వారా విడుదల అయితే ఖచ్చితంగా మంచి వసూళ్లు దక్కించుకోవడంతో పాటు థియేటర్లు మళ్లీ పూర్వ వైభవంను దక్కించుకుంటాయి.
అలాంటి ఫ్యామిలీ సినిమాలు ఇప్పుడు కావాలి కాని ఆ సినిమా ఓటీటీకి వెళ్తుంటే మాత్రం ఏ ఒక్కరు స్పందించడం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో నాని ని అప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే వారు స్పందించాల్సిందే అంటూ డిమాండ్ వినిపిస్తుంది.