సోషల్ మీడియా అంటేనే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా వెంటనే దాన్ని పట్టుకుని వచ్చి ట్రెండ్ చేసేస్తుంది.ఇక పోతే ఈ కాలంలో ఎప్పుడూ ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
చాలా ప్రాంతాల్లో కొన్ని రకాల ఛాలెంజ్లు ఈ మధ్య ఫేమస్ కావడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.అయితే ఇప్పుడు మరో ఛాలెంజ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇప్పటికే ఐస్ బకెట్ ఛాలెంజ్ లేదంటే బాటిల్ ఫ్లిప్పింగ్ అంటూ చాలా రకాల ఛాలెంజ్ లు ఉన్నాయి.ఇందులో కొన్ని ఏమో చేసే వారికే చిరాకుగా అనిపిస్తే ఇంకొన్ని ఏమో చూసే వారికి కూడా ఇబ్బందికరంగానే ఉంటున్నాయి.
ఇక ఇప్పుడు మాత్రం ఘోస్ట్ ఫోటో ఛాలెంజ్ అంటూ కొత్త ఫొటో ఛాలెంజ్ తెరమీదకు వచ్చింది.దీని గురించి వింటేనే చాలా మందికి భయం వేయక మానదేమో.
ఎందుకంటే దెయ్యాలు అంటే ప్రతి ఒక్కరికీ భయమే కదా.అయితే ఈ ఘోస్ట్ చాలెంజ్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నది ఏం కాదు.
గత 2020లోనే టిక్టాక్ వేదికగా హాలోవీన్ పేరుతో చాలా పాపులర్ అయిపోయింది.అసలు ఈ ఘోస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనుషులు తమ ఒళ్లంతా తెల్లటి క్లాత్ను వేసుకుని ఎవరికీ కనిపించకుండా కేవలం ఆ క్లాత్ మీద నుంచి నల్ల కళ్లజోడు పెట్టుకోవడం.
అలా దెయ్యంలా రెడీ అయిపోయి పబ్లిక్ ఏరియాల్లో ఫొటోలు దిగాలి.ఇక ఈ విధంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమకు ఇష్టం వచ్చిన వారికి ఈ ఛాలెంజ్ను విసిరి తమలాగే దిగమని చెప్పాలి.దీన్నే ఘోస్ట్ ఫొటో ఛాలెంజ్ అంటున్నారు.ఇది ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో తెగ హల్ చల్ చేస్తోంది.ఎక్కడ చూసినా ఘోస్ట్ ఫొటోలే కనిపిస్తున్నాయి.కానీ ఈ విధంగా పబ్లిక్ ఏరియాల్లో తిరగడంతో వారంతా చాలా ఇబ్బంది పడుతున్నారు.
చిన్న పిల్లలు, హార్ట్ పేషెంట్లు చాలామంది దీని గురించి తెలిస్తేనే వణికిపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.