వేసవి కాలం రాబోతుంది.ఎండలు పెరుగుతుండడంతో ఉదయం నుంచే ఉక్కపోతలు మొదలవుతాయి.
అయితే సమ్మర్ సీజన్లో చాలా మందిని అత్యధికంగా వేధించే సమస్య సన్ ట్యాన్.కాసేపు అలా ఎండలోకి వెళ్లొస్తే చాలు చర్మం నల్లగా మారుతుంది.
యూవి కిరణాలు నేరుగా చర్మం మీద పడి కణాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఇలా చర్మం ట్యానింగ్కు గురవుతుంది.ఇక ఈ సమస్యను నివారించుకునేందుకు ఏవేవో క్రీములు వాడుతుంటారు.
అయితే కెమికల్స్తో నిండి ఉండే క్రీములు కాకుండా న్యాచురల్గా కూడా సన్ ట్యాన్ సమస్యను దూరం చేసుకోవచ్చు.
ముఖ్యంగా సమ్మర్ సీజన్లో విరి విరిగా దొరికే సపోటా పండ్లు ట్యానింగ్ సమస్యను అద్భుతంగా నివారిస్తుంది.
మరి సపోటా పండ్లను ఎలా యూజ్ చేయాలో చూడండి.ముందు బాగా పండిన సపోటా నుంచి గుజ్జు తీసుకుని అందులో నిమ్మ రసం మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ చిట్కాను రోజూ ఉపయోగిస్తుంటే సన్ టాన్ సమస్య దూరం అవుతుంది.
అలాగే ఒక బౌల్లో బాగా పండిన సపోటా పండు గుజ్జులో చందనం పొడి, పాలు వేసి బాగా కలిపి చర్మానికి అప్లై చేయాలి.పావు గంట పాటు ఆరనిచ్చి అనంతరం వాటర్తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే సన్ ట్యాన్ సమస్యే ఉండదు.
ఇక సపోటా పండు గుజ్జును ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఓట్స్ పొడి మరియు తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి.వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే ట్యానింగ్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.