మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెల 10వ తేదీన కేబుల్ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఈ ప్రమాదం తర్వాత సాయితేజ్ కోమాలోకి వెళ్లారని అతడు స్పృహలోకి వచ్చిన తర్వాతనే అతనికి కాలర్ బోన్ సర్జరీ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలోనే సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులు వెల్లడించారు.అయితే ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి రావడంతో సాయి ధరమ్ తేజ్ నటించినటువంటి రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఈ వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ సాయి తేజ్ ఆరోగ్యం గురించి ప్రస్తావించారు.తను ఇప్పటికీ కళ్ళు తెరవలేదని పవన్ కళ్యాణ్ సాయి తేజ్ ఆరోగ్యం గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో అభిమానులు అతని ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా రిపబ్లిక్ సినిమా దర్శకుడు దేవా కట్టా సాయి తేజ ఆరోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను సినిమా ప్రీ రిలీజ్ వేడుక కంటే ముందుగా సాయి తేజ్ ను కలిశానని,తన ఆరోగ్యం కుదుటపడుతుందని తనని కలిసిన తర్వాతే సినిమాను అక్టోబర్ ఒకటో తేదీన విడుదల చేయాలని భావించినట్లు దర్శకుడు దేవాకట్టా తెలిపారు.
ఈక్రమంలోనే సాయి తేజ్ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక చూశారని కూడా ఆ తర్వాత దేవాకట్టా చెప్పడంతో అభిమానులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.కోమాలో ఉన్న సాయి తేజ్ ఫ్రీ రిలీజ్ వేడుక ఏ విధంగా చూడగలరు అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.ఈ క్రమంలోనే సాయితేజ ఆరోగ్య విషయంపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడటంతో అతని ఆరోగ్యం గురించి ఏదో దాస్తున్నారు అంటూ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే తన ఆరోగ్య విషయంపై అభిమానులకు క్లారిటీ ఇవ్వాలని సాయితేజ్ కుటుంబ సభ్యులను అభిమానులు వేడుకుంటున్నారు.