రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉందని.
హీరోలు ఇద్దరు కూడా డబ్బింగ్ చెబుతున్నారు అంటూ అనౌన్స్ చేయడంతో పాటు ఇద్దరు హీరోలు బైక్ పై వెళ్తున్న ఫొటో ను షేర్ చేశారు.ఎన్టీఆర్ బుల్లెట్ ను డ్రైవ్ చేస్తూ ఉండగా రామ్ చరణ్ వెనుక కూర్చుని ఉన్నాడు.
ఈ ఫొటో కు మంచి రెస్పాన్స్ వచ్చింది.గత కొన్ని గంటల్లో ఈ ఫొటో తెగ ట్రెండ్ అవుతుంది.
ఈ ఫొటో పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు లు ట్వీట్ చేశారు.ఆ ట్వీట్ కు ఆర్ ఆర్ ఆర్ టీమ్ కూడా ఫన్నీ రిప్లై ఇవ్వడం మరింత ఆసక్తి కరంగా మారింది.
ఈ మద్య కాలంలో ట్రాఫిక్ పోలీసు విభాగం వారు హెల్మెట్ విషయంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ వచ్చిన వెంటనే హీరో లు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకుని లేరు.
ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని ఉంటే పర్ఫెక్ట్ అన్నట్లుగా వారు ఈ ఫొటోను షేర్ చేశారు.హెల్మెట్ మార్ఫింగ్ చేసి పోలీసులు ట్వీట్ చేసిన ఫొటో కు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఇంకా నెంబర్ ప్లేట్ కూడా ఈ బండికి లేదు అంటూ సరదాగా ట్వీట్ చేశారు.
మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ తో తప్పకుండా హెల్మెట్ ధరించాలనే మెసేజ్ ను పోలీసు వారు ఇవ్వడం అభినందనీయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ఆగస్టు కు పూర్తి చేసి వచ్చే ఏడాది లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ ను హైదరాబాద్ శివారు ప్రాంతంలో చిత్రీకరణ చేస్తున్నారు.