పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కి భారత ప్రధాని మోడీ లెటర్ రాయడం జరిగింది.పాకిస్తాన్ దేశంతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నట్లు, అదేవిధంగా ఈ స్నేహం నమ్మకమైన పునాదులపై నిలబడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో పాకిస్తాన్ దేశం మొదట ఉగ్రవాదం నుండి దూరం కావాలని లేఖలో పేర్కొంది పాకిస్తాన్ డే సందర్భంగా ఆ దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం రెండు దేశాల మధ్య సింధూ నదీ జలాల విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో మోడీ లెటర్ రాయడం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.గత నెలలో రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు దేశ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలకు చెందిన మిలటరీ అధికారులు ఓ నిర్ణయానికి రావడం జరిగింది.
తర్వాత సోమవారం పాకిస్తాన్ దేశానికి చెందిన అధికారులు మొట్టమొదటిసారి ఇండియాకు రాగా నదీజలాల పంపిణీపై ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో మోడీ పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ కు లెటర్ రాయడం గమనార్హం.
.