గత కొన్ని నెలల నుండి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా కరోనా బాధితులకు అండగా ఉంటు తనవంతు సాయం చేసిన సోను సూద్ గురించి అంతో ఇంతో కాదు.
ప్రజల గుండెల్లో దేవుడు గా నిలిచిన తను ఎంతోమంది బాధితులకు తమకున్న సమస్యల పరంగా సహాయం అందించారు.కాగా ప్రస్తుతం గుండెకు సంబంధించిన సమస్య తో బాధ పడుతున్న నాలుగు నెలల చిన్నారికి సాయం కోసం ముందుకు వచ్చి తన మంచితనాన్ని మళ్లీ చాటిచూపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా జగ్గారావు పల్లెకు చెందిన బాబు, రజిత ల కుమారుడైన నాలుగు నెలల చిన్నారి అద్విత్ శౌర్య.ఆ బాబు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండటంతో వెంటనే సోను సూద్ తనవంతు సాయం తో ముందుకు వచ్చారు.అద్విత్ శౌర్య కు ఉన్న గుండె సమస్యకు దాదాపు రూ.8 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలుపగా ఆ తల్లిదండ్రుల బాధను చూసి తట్టుకోలేని గ్రామస్తులు రూ.40 వేలు సాయం చేయగా.కొందరు వాళ్ళకున్న సమస్య గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
దీంతో ఆ పోస్ట్ కు వెంటనే స్పందించిన సోనూసూద్ అద్విత్ శౌర్య ఆపరేషన్ కు అయ్యే ఖర్చు తను అందిస్తానని తెలిపారు.
రోజు పని చేస్తే పూటకి గడవని ఆ కుటుంబ బాధను తన బాధ్యతగా తీసుకొని తన వంతు సహాయం అందించి ప్రజల గుండెల్లో దేవుడు స్థానంలో నిలిచారు సోనూసూద్.కాగా సోనూసూద్ కు సంబంధించిన సిబ్బందులు అద్విత్ శౌర్య కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకొని ఇన్నోవా ఆస్పత్రిలో ఆపరేషన్ చేయిస్తామని సోనూసూద్ ఆ కుటుంబ సభ్యులకు తెలిపారు.రీల్ లైఫ్ లో విలన్ పాత్ర నుండి వచ్చిన సోనూసూద్ రియల్ లైఫ్ లో హీరోగా ప్రజల గుండెల్లో నిలిచారు.