వైసీపీ ఫైర్బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజాకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు.
ఆమెకు తన నియోజకవర్గం అయిన నగరిలో రాజకీయంగా సొంత పార్టీలోనే శత్రువుగా ఉన్న మాజీ మునిసిపల్ చైర్మన్ దంపతులను జగన్ అందలం ఎక్కించారు.గతంలో నగరి మునిసిపల్ చైర్మన్గా పనిచేసిన కెజె.
కుమార్, ఆయన భార్య కెజె.శాంతి కొద్ది రోజులుగా నగరిలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న మరో గ్రూపునకు నాయకత్వం వహిస్తున్నారు.
వీరిని రోజా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.అంతే కాకుండా ఈ గ్రూపు అణగదొక్కే ప్రయత్నాలు కూడా రోజా చేస్తున్నారన్న ప్రచారం నగరిలో జరుగుతోంది.
మరోవైపు కెజె.కుమార్ దంపతుల గ్రూప్నకు అదే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్టు ఫుల్లుగా ఉందన్న టాక్ కూడా వస్తోంది.ఈ క్రమంలోనే కెజె.కుమార్ దగ్గరకు ఎవ్వరూ వెళ్లవద్దని.
వారు నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఎవ్వరూ వెళ్లడానికి వీలులేదని రోజా హుకుం జారీ చేసిన ఆడియో క్లిప్పులు కూడా కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి.ఇలాంటి సమయంలో రోజాకు షాక్ ఇస్తూ కెజె.
శాంతిని ప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది.
ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ గా కేజే శాంతిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నియోజకవర్గంలోనే తనకు వ్యతిరేకంగా గ్రూపు నడుపుతోన్న కెజె.కుమార్కు జగన్ పదవి ఇవ్వడం రోజాకు పెద్ద షాకే అని చెప్పాలి.
నగరి నియోజకవర్గంలో రోజాను అన్ని విధాలా రాజకీయంగా అణగదొక్కే విషయంలో కొందరు కీలక నేతలు సైతం పావులు కదుపుతున్నారని.వారి అండదండలతోనే కుమార్ భార్య శాంతికి ఈ పదవి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనా తన నియోజకవర్గంలో తనకు శత్రువుగా ఉన్న వారికి జగన్ పదవి కట్టబెట్టడం రోజాను మరింతగా ఉడికించినట్లయ్యింది.