శ్రీదేవి నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాల్లోనూ ఒక వెబ్ సిరీస్ లోనూ నటించింది.ఆ మూడు ప్రాజెక్టులు కూడా జాన్వీ కపూర్ కు సోసో గానే గుర్తింపు తెచ్చాయి.
నటిగా మొదటి సినిమా పర్వాలేదనిపించినా గుంజన్ సక్సేనా సినిమా ఆమెకు చాలా నిరాశ కలిగించింది.ఆ సినిమాలో ఆమె నటనకు గాను ప్రశంసలు దక్కించుకుంటుందని అంతా భావించారు.
కానీ ఆ పాత్రకు ఏ మాత్రం ఆకట్టుకోలేదంటూ విమర్శలను ఎదుర్కొంది.గుంజన్ సక్సేనా సినిమా తర్వాత జాన్వీ కపూర్ కాస్త గ్యాప్ ఇచ్చింది.
ఇప్పటికే ఆమె ఆరు నెలల గ్యాప్ తీసుకుంది, మరో రెండు మూడు నెలల పాటు ఆమె ఖాళీగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది, ఆ తర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన కో కో కోకిల రీమేక్ లో నటించబోతోంది.నయనతార హీరోయిన్ గా నటించిన ఆ సినిమా సౌత్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన ఆ సినిమాలో నయనతార నటన అవార్డులు దక్కించుకుంది.విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన నయనతార నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం కావడం వల్ల నయన తార వంటి స్టార్ హీరోయిన్ నటించడం వల్ల సినిమా సూపర్ హిట్ అయ్యింది.అదే సినిమాను జాన్వీ కపూర్ వంటి కొత్త హీరోయిన్ తో తెరకెక్కిస్తే ఎలా ఉంటుందా అంటే ఇప్పుడు సినీ వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలు జాన్వీ కపూర్ కి ఆ పాత్రకు ఏ మాత్రం సూట్ కాదు అంటూ మరి కొందరు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.అమాయకమైన ఒక మధ్య తరగతి అమ్మాయి డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కోవడం ఆ తర్వాత ఎలా బయటపడింది అనేది ఈ సినిమా కథాంశం.
గుంజన్ సక్సేనాతో విమర్శలు పొందిన జాన్వీ కపూర్ ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ప్రయోగం అవసరమా అంటూ ఆమె సన్నిహితులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.