మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఆగస్టులో రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలు అయ్యింది.ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాలేదు.
ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుందో తెలియదు.వచ్చే ఏడాది షూటింగ్ ను ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పుడు షూటింగ్ ప్రారంభం కాకుండానే అప్పుడే ఆగస్టులో సినిమాను ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
అందుకు సంబంధించి దర్శకుడు పరశురామ్ తన టీంతో చర్చలు జరుపుతున్నారు.మహేష్ బాబు లుక్ ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.
లైట్ గా గడ్డం ఉండటంతో పాటు కాస్త ట్రెండీ లుక్ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడట.ఈ ఏడాది ఎలాగూ ఒక సినిమాతో వచ్చేశాను కనుక మెల్లగానే తదుపరి సినిమాను చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో మహేష్బాబు ఉన్నాడట.
సర్కారు వారి పాట అనౌన్స్ చేసి ఆరు నెలలు అవుతున్నా కూడా షూటింగ్ కు మరో నాలుగు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు.ఎందుకంటే మహేష్ బాబు షూటింగ్ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోవాలని భావించడం లేదు.
ఎందుకంటే ఆయన షూటింగ్ కు వెళ్లి యూనిట్ సభ్యుల్లో ఎవరైనా కరోనా బారిన పడితే ఎలా అనే ఉద్దేశ్యంతో ఉన్నాడట.తన వల్ల ఎవరికి రిస్క్ ఉండకూడదు అనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు షూటింగ్ ను ఆలస్యం చేస్తున్నాడట.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మొదలు అయ్యే అవకాశం ఉంది.వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చేనో సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలు అయ్యేనో చెప్పలేని పరిస్థితి ఇలాంటి సమయంలో ఆగస్టులో సినిమా విడుదల అవ్వబోతుంది అంటూ ప్రకటనలు చేయడం ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న తీరున ఉందని నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.