ప్రకృతి ప్రేమికుడు అయిన ప్రధాని నరేంద్ర మోడీ.ఈ మధ్య కాలంలో ప్రకృతి అందాలపై మరింత దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది.
ఇటీవల ఆయన ఇంటి ఆవరణలో సంచరిస్తున్న నెమలిని మచ్చిక చేసుకుని దానికి ఆహారం తినిపిస్తున్న వీడియో పోస్ట్ చేయగా.అది ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే తాజాగా మోడీ మరో వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియోలో గుజరాత్, మోధేరాలోని చారిత్రక సన్ టెంపుల్ ఉంది.ప్రస్తుతం గుజరాత్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.దీంతో మోధేరాలోని సన్ టెంపుల్(సూర్య దేవాలయం) కూడా జలపాతాల కొలువులా మారిపోయింది.
ఆలయంలోని మెట్ల మీదుగా నీరు ప్రవహిస్తుండటం ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియో మోడీ పోస్ట్ చేస్తూ.
వర్షంలో సన్ టెంపుల్ ఎంతో అందంగా కనిపిస్తున్నదని.మీరు కూడా ఓ లుక్కేయండి అంటూ చెప్పుకొచ్చారు.
దీంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఇప్పటికే మోడీ పోస్ట్ చేసిన ఈ వీడియోకి 4.7లక్షల వ్యూస్ రాగా.80వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
కాగా, గుజరాత్ లోని మహసానా జిల్లాలో పుష్పవతి నది ఒడ్డున ఉన్న మొధెరా గ్రామంలోని పుష్పవతి నది ఒడ్డున ఈ సూర్య దేవాలయం ఉంది.ఆ ఆలయం చోళరాజుల కాలం నాటిది.
ఎంతో అద్భుతంగా ఉండే ఈ ఆలయం.ప్రత్యేకమైన నిర్మాణశైలికి ప్రతీకగా నిలిచింది.
ఇక ఈ ఆలయం శిల్పసంపద అమోఘం అని చెప్పాలి.