వామ్మో.. ఆ ఏనుగు కోపం కట్టలు తెంచుకుంది.. చివరికి ఏమైందంటే?

ఇటీవల కాలంలో మనుషులు జంతువులపై ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొన్నటికి మొన్న కేరళలో కడుపుతో ఉన్న ఓ ఏనుగుకు పైనాపిల్ లో బాంబు పెట్టి చంపేశారు.

 Angry Elephant Charges Towards Man, Sushant Nanda Twitter,angry Elephant, Man Re-TeluguStop.com

ఇంకా ఆ ఘటన తర్వాత ఎన్నో జంతువులు వివిధ కారణాలతో మృతి చెందుతున్నాయి.మొన్నటికి మొన్న గర్భంతో ఉన్న ఓ బర్రెను కొందరు కలిసి చంపేసి ఇప్పుడు జైల్లో కూర్చున్నారు.

ఇది పక్కన పెడితే మొన్న కేరళలో మనుషుల కారణంగా ఏనుగు చనిపోవడంతో ఏనుగులపై మనుషులకు అమితమైన ప్రేమ పెరిగింది.దీంతో ఎక్కడ ఏ జంతువు కనిపించిన కొందరు మంచి ఆహారం పెట్టి వెళ్తున్నారు.కానీ ఓ ఏనుగుకు ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఓ వ్యక్తిపై విరుచుకుపడింది.14 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో ఏనుగు కోపం కట్టలు తెంచుకున్నట్టు కనిపిస్తుంది.

ఇంకా ఈ వీడియోను కూడా భారత దేశ అటవీ శాఖ అధికారి సుశాంత్ నందు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.అసలు ఆ వీడియోలో ఎం ఉంది అంటే? ఓ వ్యక్తి పొద వెనుక కూర్చొని ఉన్నాడు.ఉన్నట్టుండి ఏనుగు మ‌నిషి మీద‌కు అమాంతం వచ్చేసింది అయితే అతను కర్రతో కొట్టబోయాడు కానీ తప్పించుకున్నాడు.కాసేపటికి ఆన్లైన్ కి వచ్చిన వ్యక్తి వీడియో షేర్ చేశాడు.

అదికాస్తా సుశాంత్ నందు సెకండ్ లైఫ్ అంటూ షేర్ చెయ్యగా ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube