యాంకర్ అనసూయ భరధ్వాజ్.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు.టెలివిజన్ యాంకర్గా కెరీర్ స్టాట్ చేసిన ఈ అమ్మడు.జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర యాంకర్గా అడుగుపెట్టింది.ఈ కామెడీ షో ద్వారా అనసూయ భారీ క్రేజ్ సంపాదించుకుంది.అనతి కాలంలోనే స్టార్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.
జబర్దస్త్ షో ద్వారా సినిమాల్లోనూ అవకశాలు దక్కించుకుంది.
ఈ క్రమంలోనే సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, విన్నర్, రంగస్థలం, ఎఫ్ 2 వంటి సినిమాల్లో నటించి.
వెండితెరపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన `రంగస్థలం` చిత్రం అనసూయకు భారీ హైప్ క్రియేట్ చేసింది.
రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ఇక పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నా.
సోషల్ మీడియాలో అనసూయ ఘాటు అందాలకు ముగ్ధులయ్యే వారు చాలా మందే ఉన్నారు.మరి అలాంటి అనసూయ తనను ఆంటీ అంటే మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు.
తాజాగా పాపులర్ యాంకర్ సుమతో ఓ షోలో పాల్గొన్న అనసూయను.కొందరు నెటిజన్లు ఆంటీ అంటూ సంబోధించారు.
దీంతో ఆగ్రహానికి గురైన అనసూయ.మీసాలు గడ్డాలు వచ్చిన వాళ్లు కూడా నన్ను ఆంటీ అంటూ పిలవడం చిరాకు తెప్పిస్తుందని వాపోయింది.
నా పిల్లల తోటి వారు నన్ను ఆంటీ అంటే పర్వాలేదు.కానీ, పిల్లలకు తండ్రులు కూడా ఆంటీ అనడం ఆశ్చర్యంగా అనిపిస్తుందని.
కనీస జ్ఞానం ఉండాలి కదా అంటూ ఆసహనం వ్యక్తం చేసింది.అదే సమయంలో.
వాళ్లు ఎవరో ఆంటీ అన్నంత మాత్రాన మనం ఆంటీలం అవుతామా.మనం అనుకుంటే అప్పుడు ఆంటీలం అవుతామని తనదైన శైలిలో నవ్వించేందుకు ప్రయత్నించింది సుమ.