కొంతమందికి డబ్బు లేకపోయినా మంచి మనసు ఉంటుంది.వాళ్ళు మంచి మనసు చాటుకున్న సమయంలోనే మనకు వాళ్ళ గురించి తెలుస్తుంది.
మనిషిలో మానవత్వం ఇంకా బతికే ఉంది అని.ఈ కరోనా వైరస్ కాలంలో మనిషిలోని మానవత్వం చచ్చిపోయింది అనేందుకు ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి.
కానీ ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది.మనిషిలో మానవత్వం చావలేదు అని.భారత అటవీశాఖ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో ఓ అద్భుతమైన వీడియోను షేర్ చేశాడు.ఆ వీడియోలో ఓ వృద్ధుడైన బిచ్చగాడు తినే సమయంలోనే తన వద్దకు కుక్కలు వచ్చి చేరాయి.
దీంతో ఆ వృద్ధుడు తింటున్న ఆహారాన్ని రెండు ప్లేట్ లలో వేసి కుక్కలకు తినిపించాడు.
ఇంకా అది అంత వీడియో తియ్యగా.”సంపదలో పేదవాడు అయినా మనసున్న వ్యక్తిలో ధనవంతుడు” అంటూ అతను వీడియోను షేర్ చేశాడు.అయితే వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే అది వైరల్ గా మారింది.
ఈ వృద్ధుడు మనిషిలోని మానవత్వాన్ని చాటుకున్నాడు అంటూ నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.మరి మీరు ఓ సారి ఆ వీడియోను చూసేయండి.