సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఐదేళ్ళ కాలంలో తెలుగులో టాప్ హీరోలు అందరితో జత కట్టేసింది.ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు చేతిలో పెద్దగా సినిమాలు లేవు.
ఇప్పుడు ఈమెని క్రాస్ చేసుకొని రేసులోకి పూజాహెగ్డే, రష్మిక, కీర్తి సురేష్ వచ్చేశారు.ఈ భామల హవా ఇప్పుడు నడుస్తుంది.
అయితే రకుల్ కి తమిళంతో పాటు హిందీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.తమిళంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న భారతీయుడు సీక్వెల్ లో రకుల్ నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు వయసు 30+ క్రాస్ చేయడంతో పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి.ఎక్కడికి వెళ్ళిన పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎక్కువ ఎదురవుతుంది.
ఇప్పటికే బాలీవుడ్ లో ఓ నటుడుతో ఈ అమ్మడు డేటింగ్ లో ఉంది అంటూ కూడా కథనాలు వినిపిస్తున్నాయి.
ఓ బిజినెస్ మ్యాన్తో రకుల్ పెళ్లి జరగబోతుందనే వార్తలు కూడా వచ్చాయి.
దీనిపై ఇప్పుడు ఆమె తల్లి క్లారిటీ ఇచ్చింది.రకుల్కు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యమే లేదని చెప్పింది.
ప్రస్తుతం చాలా బిజీగా ఉందని, అన్ని కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తా అంటుంది.దాంతో పాటు రకుల్కు పెళ్లి ఆలోచన ప్రస్తుతానికి లేదని తాను ఎప్పుడొచ్చి తనకు పెళ్లి చేయండి అని అడుగుతుందో అప్పుడే తాము కూడా ఆలోచిస్తామని క్లారిటీ ఇచ్చింది.
అంతేకాదు తాను ఎవరిని కోరుకుంటే అతన్నే ఇచ్చి పెళ్లి చేస్తామని కూడా చెప్పింది రకుల్ తల్లి.మొత్తానికి రకుల్ పెళ్లి వార్తలపై ఆమె తల్లి ఇచ్చిన సమాధానంతో ఫుల్ క్లారిటీ దొరికినట్లు అయ్యింది.