టాలీవుడ్ లో చిరంజీవికి జోడీగా ఇంద్ర, శంకర్ దాదా సినిమాలో నటించిన సోనాలీ బింద్రేఅందరికి తెలిసిందే.స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా పెద్ద హీరోలకి జోడీగా నటించిన సోనాలీ బింద్రే ఆ మధ్య క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు బయట పడి ఇంటి వద్దనే ఉంటుంది.
క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత మరల సినిమాలలో నటించే ప్రయత్నాలు చేస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా కారణంగా అమలవుతున్న లాక్ డౌన్ పై ఆమె ఆసక్తికర వాఖ్యలు చేసారు.
లాక్డౌన్ తరహా పరిస్థితులు నాకు కొత్తవేం కాదని ఆమె క్యాన్సర్ సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉందనే విషయాన్ని పంచుకుంది.
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది.
నాలో రోగ నిరోధక శక్తి కూడా పెరిగింది.ఇందుకోసం నేను ఆరోగ్యకరమైన ఫలాలు, కూరగాయలను తింటున్నాను.
క్యాన్సర్కు చికిత్స తీసుకునే ప్రక్రియలో భాగంగా రెండేళ్ల క్రితం ఇంటికే పరిమితమై క్వారంటైన్ తరహా పరిస్థితులనే ఎదుర్కొన్నాను.ఇప్పుడు కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా క్వారంటైన్లో ఉంటున్నాం.
అందుకే ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితులకు, నా క్వారంటైన్కి పెద్ద తేడా కనిపించడం లేదు.కానీ ఆ సమయంలో నా యోగ క్షేమాల గురించి తెలుసుకోవడానికి నా స్నేహితులు, బంధువులు మా ఇంటికి వచ్చేవారు.
ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు.ఫోన్ చేసి మీరు బాగున్నారా అని పలకరిస్తున్నారు.
అయినా ఇలాంటి పరిస్థితులు నా జీవితంలోనే కాదు.ఎవ్వరికి రాకూడదని కోరుకుంటున్న అని పేర్కొన్నారు.