కార్తికేయ సీక్వెల్ లో హీరోయిన్ గా అనుపమ... గెస్ట్ రోల్ లో స్వాతి

నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా కార్తికేయ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా నిఖిల్ కెరియర్ లో పెద్ద హిట్ గా నిలిస్తే.

 Anupama Parameswarana Heroine For Karthikeya Sequel Movie, Colors Swathi, Hero N-TeluguStop.com

డెబ్యూ మూవీగా చందూకి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత నిఖిల్ కూడా తన సినిమాల ఎంపిక విధానం పూర్తిగా మార్చేసుకున్నాడు.

ఇక ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని గతంలోనే వీరు ప్లాన్ చేసుకున్నారు.అయితే ఇద్దరు వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటం వలన సెట్ కాలేదు.

అయితే ఇప్పుడు అఫీషియల్ గా కార్తికేయ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళబోతుంది.ఇప్పటికే ఈ సినిమా ఓపనింగ్ కూడా జరిగిపోయింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.రాక్షసుడు సినిమా తర్వాత తెలుగులో ఆమె నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

ఈ సినిమా మీదనే ఆమె ఆశలు పెట్టుకుంది.ఇక ఇందులో మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి కూడా గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతుంది అని సమాచారం.

కథ పరంగా మొదటి భాగంలో ఉండే హీరో పాత్ర మాత్రమే ఉంటుందని, మిగిలిన పాత్రలన్నీ మారిపోతాయని టాక్ వినిపిస్తుంది.యూనివర్శల్ కాన్సెప్ట్ కావడంతో దీనిని లిమిటెడ్ బడ్జెట్ లోనే పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మొత్తం సౌత్ భాషలతో పాటు ఎనిమిది భాషలలో సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి సినిమా స్థాయిని అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube