సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు ఎంతో కష్టపడి సినిమా టికెట్టు కొనుక్కుని థియేటర్లకు వస్తారు.సీటులో కూర్చోగానే సినిమా స్టార్ట్ అవుతుందనుకునే వారికి పెద్ద తలనొప్పి తెచ్చిపెడతాడు ముఖేష్.
సినిమా మొదలయ్యిందా అంటూ తమ పక్కన వారిని అడిగేలా చేస్తాడు ఆ ముఖేష్.కానీ ప్రతిరోజు పండగేకు ఈ బెడద లేదని తెలుస్తోంది.
ఇంతకీ ఈ ముఖేష్ ఎవరు అనుకుంటున్నారా?
సినిమా మొదలయ్యే ముందు వచ్చే ముఖేష్ యాడ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.‘నా పేరు ముఖేష్.
’ అంటూ సాగే ఈ క్యాన్సర్ అవగాహన యాడ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే.కానీ చాలా మంది ఈ యాడ్ను చూడాలంటే భయపడతారు.
ఈ యాడ్ వస్తున్నంత సేపు తమ సెల్ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు.ఇక సినిమా టైటిల్స్ పడ్డాకే తమ తలలు ఎత్తుతారు.
అయితే ప్రతిరోజూ పండగే సినిమా చూసేందుకు వెళ్లే ప్రేక్షకులకు ఈ సమస్య ఉండదట.ఈ సినిమాలో ఒక్క స్మోకింగ్ సీన్ కూడా లేకపోవడంతో ఈ యాడ్ ఉండదని తెలుస్తోంది.
ఇక ముఖేష్ యాడ్ అంటే భయపడే వారు దర్జాగా ఈ సినిమాకు వెళ్లి తలెత్తుకుని కూర్చోవచ్చని అంటున్నారు చిత్ర యూనిట్.సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ప్రతిరోజూ పండగే సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేయగా డిసెంబర్ 20న ప్రపంచవ్యప్తంగా రిలీజ్ అవుతోంది.