టీమ్ ఇండియా క్రికెట్ జట్టులో ఎంఎస్ ధోని వారసుడిగా పేరుతెచ్చుకున్న ఆటగాడు రిషబ్ పంత్ గతకొంత కాలంగా సరైన ఆటతీరును ప్రదర్శించడం లేదు.కాగా ప్రస్తుతం పంత్ ఓ బాలీవుడ్ బ్యూటీతో డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్లు ప్రేమాయణ సాగించడం కొత్తేమీ కాదు.అయినా సరికొత్త జంట కావడంతో వీరి డేటింగ్ గురించి ప్రస్తుతం బాలీవుడ్ గుసగుసలాడుతోంది.
అందాల భామ, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాతో పంత్ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.తాజాగా ఇండియా వెస్టిండీస్ మూడో టీ20కి ముందు రోజు పంత్, ఊర్వశి రౌతెలా కలిసి ముంబైలోని ఓ హోటల్లో డిన్నర్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రేమలో లేకపోతే వీరిద్దరు కలిసి ఇలా చెట్టాపట్టాలేసుకుని ఎందుకు తిరుగుతారు? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇక గతంతో మరో క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ఊర్వశి రౌతెలా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే.కానీ తమ మధ్య ఎలాంటి వ్యవహారం లేదంటూ ఊర్వశి కొట్టిపారేసింది.మరి ఇప్పుడు పంత్ పరిస్థితి చివరకు ఏమౌతుందా అని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కొంటున్నారు.