అమెరికా అధ్యక్షుడైనా సరే చట్టం ముందు అందరూ సమానమే.ఆయనపై వచ్చిన అభియోగాల విచారణ ఎదుర్కోవడం కోసం తప్పకుండా యూఎస్ కాంగ్రెస్ ముందు హాజరవ్వాలి అంటూ అమెరికా జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ట్రంప్ పై కొనసాగుతున్న విచారణలో ఆయన తన వాంగ్మూలం ఇవ్వాల్సిందే అంటూ తేల్చి చెప్పింది.విచారణని అధ్యక్షుడు గౌరవించాలని పేర్కొంది.
ఈ మేరకు
స్థానిక జిల్లా కోర్టు న్యాయమూర్తి కేటన్జీ బ్రౌన్ జాక్సన్ వైట్ హౌస్ మాజీ సలహాదారుగా పని చేసిన మెక్ గాన్ కి స్పష్టం చేశారు.విచారణకి హాజరయ్యేందుకు చట్టపరమైన అన్ని సౌకర్యాలని కల్పించాలని వాటిని అధ్యక్షుడు ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు.2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా జోక్యంపై విచారణ జరిపిన రాబర్ట్ ముల్లర్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రతినిధుల సభ విచారణ జరుపుతున్న విషయం విధితమే.అయితే ఈ క్రమంలోనే
అమెరికా కోర్టు ట్రంప్ హాజరుపై కీలక ఆదేశాలు ఇవ్వడం ట్రంప్ కి ఇబ్బందికర పరిణామమే అంటున్నారు నిపుణులు.అంతేకాదు అధ్యక్షుడు అయినా ఎవరైనా సరే కోర్టుల ముందు సమానమేనని , ఎవరూ అతీతులు కాదని చురకలు అంటించింది కోర్టు.మరి ఈ వ్యవహారంపై అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.