టాలీవుడ్ లో ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక మందన, చిన్న హీరోలతో కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో జోడీ కట్టే వరకు ఆమె క్రేజ్ వచ్చేసింది.వరుస ఆఫర్స్ తో ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ అందరిని పక్కకి నెట్టి ముందు వరుసలోకి దూసుకొచ్చిన రష్మికకి స్టార్ హీరోల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
మహేష్ తర్వాత వెంటనే అల్లు అర్జున్ సినిమాలో ఈ భామ కనిపించబోతుంది.ఇదిలా ఉంటే తాజాగా డియర్ కామ్రేడ్ సినిమా రష్మిక హీరోయిన్ గా చేయగా అది ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాకి విజయ్ దేవరకొండ ఎంత ప్రమోషన్ చేసిన సినిమా మాత్రం నిలబడలేదు.అయితే ఇందులో రష్మిక పాత్ర మాత్రం అందరికి భాగా కనెక్ట్ అయ్యింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ మీడియాతో మాట్లాడుతూ తనకున్న ఓ ఆసక్తికరమైన కోరికని బయటపెట్టింది.ఎప్పటికైనా తానని అభిమానించే ప్రేక్షకులకి గుర్తుండిపోయే పాత్రలు చేయడంతో పాటు అభిమానుల చేత గుడి కట్టించుకోవడమే తన లక్ష్యం అని చెబుతుంది.
ఖుష్బూకు గుడి కట్టించిన విషయాన్ని తన తండ్రి చిన్నతనంలో తనకు చెప్పేవాడని తను కూడా ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అనుకుంటున్నట్టుగా రష్మిక వివరించింది.అయితే ఖుష్బు మాదిరి గుడి కావాలంటే కచ్చితం తమిళంలో సక్సెస్ కావడంతో పాటు కాస్తా తమిళ ప్రేక్షకులు కోరుకునే విధంగా బొడ్డుగా తయారు కావాలని అలా అయితే గుడి కడతారని సోషల్ మీడియాలో కొందరు ఆసక్తికరమైన వాఖ్యలు చేస్తున్నారు.