టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతోంది.ఎంత అభివృద్ది చెందుతున్నామో, అంత నాశనం అవుతున్నామని ఒక కవి అన్నాడు.
అది నిజమే అని కొన్ని సంఘటనలు చూస్తుంటే అనిపిస్తుంది.చిన్న తనం నుండే టెక్నాలజీలో పెరిగిన పిల్లలకు కనీసం బయట జ్ఞానం తెలియడం లేదు.
మొబైల్లో ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నాడు తప్ప చుట్టు ఉన్న ప్రపంచంను చూసే ప్రయత్నం చేయడం లేదు.ఇక చిన్న తనం నుండే మొబైల్, నెట్ వంటివి ఉండటం వల్ల పిల్లలు చేతికి అందకుండా పోతున్నారు.
తాజాగా టెక్సాస్లోని ఒక స్కూల్లో జరిగిన సంఘటన వింటే భయంతో ఒళ్లు కంపించడం ఖాయం.ఇలాంటి పరిస్థితులు మన వద్ద కూడా వస్తాయా అనే అనుమానం వస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.టెక్సాస్లోని ఒక స్కూల్లో ప్రతి పిల్లాడికి ఐపాడ్ తప్పనిసరి చేశారు.చిన్న పిల్లలు ఏం చేస్తారు లేని, పెద్ద పిల్లలపై కాస్త నిఘా పెట్టినట్లుగా ఉన్నారేమో తాజాగా ఆరు సంవత్సరాల బాలుడు ఐపాడ్లో ఆ వీడియోలు చూస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.అయితే అతడికి తెలియని విషయం ఏంటీ అంటే అది చూడటం తప్పు.
అవును అతడికి ఆ వయసులో ఏం అర్ధం అవుతుంది చెప్పండి.ప్రతి ఒక్కరు కూడా అక్కడ ట్యాబ్ వాడాల్సిందే అని చెప్పడంతో మేఘన్ కూడా తన కొడుకుకు ఐప్యాడ్ కొనిచ్చింది.
కాని అతడు మాత్రం అందులో చెత్త చూస్తూ, ఇతర పిల్లలకు కూడా చూపించే ప్రయత్నం చేశాడు.
విషయం స్కూల్ వారికి తెలిసిన వెంటనే మేఘన్కు తెలియజేయడం జరిగింది.స్కూల్కు వచ్చిన మేఘన్ కొడుకు వద్దకు వెళ్లింది.అతడి ప్రవర్తనకు చిందించి.
ఇంత చిన్న వయసులో అలాంటి వీడియోలు చూడటం ఏంటని ఆమె బాధ పడింది.ఈ సమయంలోనే తన కొడుకు అలా పాడు అవ్వడంకు ప్రధాన కారణం స్కూల్ అని, స్కూల్లో చిన్న పిల్లలకు ఐపాడ్ ఏం అవసరం చెప్పండి.
అసలు పిల్లలు అంతా కూడా టైంకు క్లాస్కు వస్తున్నారనా అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు.
పిల్లలు ఐపాడ్లో ఏం చూస్తున్నారనే విషయాన్ని వాళ్లు పట్టించుకోని కారణంగా తన కొడుకు చెడ్డ దారిలో వెళ్లాడు.అందుకు స్కూల్ బాధ్యత వహించి నాకు జరిమాన ఇవ్వాల్సిందిగా కోర్టును కోరింది.కోర్టు తీర్పు తాజాగా ఆమెకు అనూకూలంగా వచ్చింది.
స్కూల్ యాజమాన్యంకు ఆమె చుక్కలు చూపించింది.తాము చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ వాడలేదు.
అయినా కూడా నేను బాగానే చదువుకున్నాను.ఇప్పుడు ఐపాడ్లు అంటూ మొదలు పెడితే మళ్లీ వారి జీవితాలను నాశనం చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
కోర్టు ఆమె వాదనతో ఏకీభవించింది.