వైజాగ్ లో మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయరెడ్డి హత్యకి గురైన సంగతి అందరికి తెలిసిందే.ఆమెని తన అపార్ట్ మెంట్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, బంగారు ఆభరణాలు దోచేసి డెడ్ బాడీని బాత్ రూమ్ లో పడేసారు.
ఈ హత్య కేసుని సీరియస్ గా తీసుకొని విచారించిన పోలీసులు తాజాగా నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.
విజయరెడ్డి ఫ్లాట్ అమ్మకానికి పెట్టింది.
ఈ విషయంలో ఆమె దగ్గరకి ఫ్లాట్ కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రశాంత్ అనే వ్యక్తి, ఆమె మెడలో ఆభరణాలు చూసి వాటిని సొంతం చేసుకోవాలనే ఉదేశ్యంతో విజయరెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.ఆమె గొంతు కోసి బంగారం తీసుకొని ఉడాయించాడు.
అయితే పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలతో అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు హేమంత్ ఒప్పుకున్నాడని తెలుస్తుంది.