షాకింగ్ : జనతా ఆడియో వివాదం

యంగ్ టైగర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా ఆడియో విడుదల అయ్యి నాలుగు రోజులు గడవక ముందే వివాదాల్లోకి వెళ్ళింది.ఈ సినిమాలో థీమ్ సాంగ్ ‘జయహో జనతా’ ట్యూన్ వింటూ ఉంటే రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ లో వాడిన సౌండ్ ట్రాక్ గుర్తుకు వస్తుందని, దేవిశ్రీ ఈ ట్రాక్ ని కాపీ చేసాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

 Shocking News On Ntr Janatha Garage-TeluguStop.com

ఈ విధంగా అనుకోని విమర్శలు రావటంతో జనతా గ్యారేజ్ యూనిట్ షాక్ కి గురి అయింది.

అయితే రెండు సినిమాలకు హీరో వేరైనా సంగీతం దేవిశ్రీ ఇవ్వటంతో ఈ ట్రాక్ వాడాడనే వార్తలు వస్తున్నాయి.

అంతేకాక ఈ మధ్య కాలంలో దేవిశ్రీ కి సినిమాలు ఎక్కువ అవ్వటంతో ట్యూన్ మీద శ్రద్ద తగ్గిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ భారీ స్థాయిలో బిజినెస్ చేసేసింది.

సినిమాను కొన్నవారికి ఇది షాకింగ్ వార్త అవుతుంది.అయితే కొందరి అభిప్రాయం ప్రకారం ‘జనతా గ్యారేజ్’ కి వచ్చిన హైప్ ని తగ్గించటానికి ఇటువంటి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube