ఏపీలో వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేశాయన్నారు.
ఏపీలోని 69 నదులను అనుసంధానం చేయడం ముఖ్యమని తెలిపారు.ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి అయితే నీటి సమస్యే ఉండదని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు.వంశధార – గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చన్నారు.
కానీ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.ఈ ఏడాది చివరిలో ఐదు ప్రాజెక్టులను ప్రారంభిస్తారట అంటూ విమర్శించారు.
ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.