ఒక మనిషి సక్సెస్ సాధించాడంటే సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి.ఒక రాయి శిల్పంలా మారడానికి ఎన్నో ఉలిదెబ్బలు తినాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే.
ప్రతి మనిషి సక్సెస్ వెనుక ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.ఉన్నత స్థానాలకు చేరిన ఎంతోమంది ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కన్నీళ్లు ఉంటాయి.
ఒకప్పుడు బిడ్డపాల కోసం 14 రూపాయలకు ఇబ్బంది పడిన వ్యక్తి ప్రస్తుతం 800 కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు.
విజయ్ కేడియా( Vijay kedia ) ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.విజయ్ తండ్రి స్టాక్ బ్రోకర్ కాగా విజయ్ పదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి మృతి చెందాడు.కుటుంబ సభ్యులు విజయ్ కు పెళ్లి చేయగా విజయ్ కు ఒక కూతురు పుట్టింది.
ఆ తర్వాత విజయ్ కు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.కుటుంబ పోషణ కోసం తల్లి బంగారు ఆభరణాలను సైతం అమ్ముకున్నాడు.
ఆ తర్వాత రోజుల్లో బిడ్డకు పాలు కూడా అందించలేక విజయ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది.ఆ తర్వాత ముంబై( Mumbai )కు వచ్చి విజయ్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఆ తర్వాత రోజుల్లో విజయ్ షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టగా లక్ కలిసొచ్చి ఊహించని స్థాయిలో సంపాదించాడు.విజయ్ ఆస్తుల విలువ ప్రస్తుతం 800 కోట్ల రూపాయలుగా ఉంది.
కేడియా సెక్యూరిటీస్ అనే సంస్థతో ఆయన కోటీశ్వరుడిగా ఎదిగాడు.ప్రస్తుతం పెట్టుబడి ప్రపంచంలో విజయ్ కేడియా పేరు మారుమ్రోగుతోంది.
కెరీర్ లో సక్సెస్ సాధించాలనుకునే ఎంతోమందికి ఆయన స్పూర్తిగా నిలిచారు.స్టాక్ మార్కెట్( Stock Market ) లో సక్సెస్ సాధించాలంటే ఓపిక ముఖ్యమని ఇన్వెస్టర్లకు రిస్క్ తీసుకునే ధైర్యం, సామర్థ్యం ఉండాలని విజయ్ కేడియా వెల్లడిస్తున్నారు.
విజయ్ కేడియా సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోందని చెప్పవచ్చు.