గుంటూరు: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆనంద బాబు, అడ్డుకున్న పోలీసులు.
పోలీసులు తీరు పై ఆనంద బాబు ఆగ్రహం.పోలీసులు సమక్షంలోనే టిడిపి జెండాలు తగలబెడితే ఏం చేస్తున్నారు.
పోలీసులు – టిడిపి వర్గీయుల మద్య వాగ్వివాదం, తోపులాటలు.
మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ… ఏపిలో ప్రజలకు బ్రతికే హక్కు లేదు, ప్రజల ప్రాధమిక హక్కులను హరిస్తున్నారు.
అధికార పార్టీ అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు.టిడిపి నేతలు టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి, రాష్ట్ర డీజిపి కనుసన్నల్లోనే టిడిపి నేతలపై దాడులు.
పోలీసుల సహకారంతోనే టిడిపి ఆఫీస్ పై దాడి.రాష్ట్రం లో శాంతి భద్రతల సమస్య పై డీజిపి సిగ్గు తో తలదించుకోవాలి.
గుంటూరు లో పోలీసుల సమక్షంలోనే టిడిపి జెండాలు తగలబెట్టారు.రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి.