డిస్కో శాంతి ( Disco shanthi )రియల్ స్టార్, మగధీర ఫేమ్ శ్రీహరిని పెళ్లాడింది.అంతకు ముందు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు డ్యాన్సులు చేస్తూ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది.
ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సిల్క్ స్మిత గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రముఖ ఐటమ్ సాంగ్ డాన్సర్ అయిన డిస్కో శాంతి మాట్లాడుతూ.“టాలీవుడ్ ఇండస్ట్రీలో జ్యోతిలక్ష్మీ, జయమాలిని లాగా గ్రేస్ ఫుల్ డాన్స్ చేసేవారు ఎవరూ లేరు.ఇండస్ట్రీ లోకి వచ్చేదాకా నాకు డ్యాన్స్ రాదు.సిల్క్ స్మితకి డ్యాన్స్ అసలే రాదు.ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత కూడా ఆమె నాట్యం నేర్చుకోలేదు.ఆమె స్టైల్ గా ఉంటుంది కానీ స్టెప్పులు వేయడం రాదు.
ఎక్స్ప్రెషన్స్ మాత్రమే బాగా ఇవ్వగలదు.జయమాలినికి తప్ప ఎవరికీ ఇండియన్ డ్యాన్సర్ బాడీ లేదు.
స్మితాది అమెరికన్ బాడీ స్ట్రక్చర్.ఆమెది ఇండియన్ బాడీ స్ట్రక్చర్ యే కాదు.” అని వ్యాఖ్యలు చేసింది.
సిల్క్ స్మిత మరణం గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పుకొచ్చింది.ఆమెకు ఒక లవర్ మాత్రం ఉండేవాడని పేర్కొంది.జ్యోతిలక్ష్మితో తాను డాన్స్ చేయలేదని, జయమాలినితో డాన్స్ చేశానని తెలిపింది.“షకీలా తో కూడా కలిసి చేశాను.” అని వెల్లడించింది.స్మిత తో మీకు మాటలు లేవా అని అడిగితే.“లేదు, ఆమెతో నాకు మంచి సంబంధం ఉంద”ని చెప్పింది.స్మిత చేసిన మూడు సినిమాల్లో తాను నటించానని కూడా పేర్కొంది.స్మిత తనను చాలా చిన్న పాపాయిలాగా చూసుకుంటుందని, ఆమెకు తనపై ఎలాంటి శత్రుత్వం లేదు అని వెల్లడించింది.
శ్రీహరి చనిపోయిన తర్వాత వారి కుటుంబాన్ని నుంచి తనకు ఎలాంటి సపోర్టు లభించలేదని చెబుతూ వాపోయింది.చుట్టాలు వచ్చినా సూటిపోటి మాటలతో అవమానిస్తారే తప్ప ఆదుకునే వారు ఎవరూ లేరని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే అత్తవారి భర్త చనిపోయిన వంటరి కోడలును చేసుకోకపోవడం ఏంటని చాలామంది ఫైర్ అవుతున్నారు.