టాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే జంటల్లో చైతూ సామ్ ముందు వరుసలోనే ఉంటారు.కానీ సమంత చేసిన చిన్న పనికి ఇప్పటికి కూడా రూమర్స్ ఆగడం లేదు.
ఈ మధ్య సమంత అక్కినేని పేరును తొలగించి S అనే లెటర్ పెట్టడంతో అప్పటి నుండి సమంత చైతన్య గురించి తీవ్రంగా చర్చలు సాగుతున్నాయి.గత నెల రోజుల నుండి ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.
వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.అయితే వీటిపై అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ స్పందించలేదు.అయితే ఇప్పుడు అవి తారా స్థాయికి చేరుకుంటున్నాయి.అయినా కూడా విడాకులపై వస్తున్న రూమర్స్ విషయంలో అటు చైతన్య కానీ ఇటు సామ్ కానీ నోరు విప్పడం లేదు.
తాజాగా ఈ విషయంపై మరొకసారి సోషల్ మీడియాలో సామ్ ను అభిమానులు ప్రశ్నించారు.
అభిమానులు ఎన్ని ప్రశ్నలు సంధిస్తున్న సమంత మాత్రం కేవలం ఒకే ప్రశ్నను సెలెక్ట్ చేసుకుని సమాధానం చెప్పింది.
తాజాగా సామ్ తాను స్టార్ట్ చేసిన సాకీ బ్రాండ్ ఏడాది కాలం పూర్తి చేసుకోవడంతో అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటించింది.ఇందులో భాగంగా ఒక అభిమాని సామ్ ను మీరు నిజంగా ముంబై వెళ్ళిపోతున్నారా అని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెప్పింది.తాను హైదరాబాద్ విడిచి ఎక్కడికి వెళ్లడం లేదని హైదరాబాద్ తన ఇల్లు అని క్లారిటీ ఇచ్చారు.ఈ పుకారు ఎక్కడ మొదలైందో తెలియదు కానీ వందలాది పుకార్లలాగా ఇది నిజం కాదు.హైదరాబాద్ నాకు అన్ని ఇచ్చింది.ఇప్పటికి ఇస్తోంది.నేను ఎప్పటికి హైదరాబాద్ వదిలి వెళ్ళను.
అని సామ్ తెలిపారు.కానీ విడాకుల ప్రశ్నపై మాత్రం అటువంటి సమాధానం చెప్పలేదు.
ఇక వచ్చే నెల అక్టోబర్ 7న వీరి మ్యారేజ్ యానివర్సీ ఉంది.కనీసం ఈ రోజు అయినా ఈ జంట నోరు విప్పి నిజం చెబుతారని అందరు భావిస్తున్నారు.కానీ అభిమానులు మాత్రం వీరిద్దరూ విడిపోతున్నారంటే తట్టుకోలేక పోతున్నారు.త్వరగా ఈ రూమర్స్ కు చెక్ పెట్టాలని కోరుతున్నారు.ఇక ఈ మధ్యనే చైతు లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.ఇక ఇప్పుడు థాంక్యూ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇక సమంత కూడా తెలుగులో శాకుంతలం సినిమాలో చేస్తుంది.