ప్రకాశం జిల్లా అద్దంకిలో రోడ్డుప్రమాదం జరిగింది.బస్టాండ్ దగ్గర మద్యం తాగిన కొందరు యువకులు బైక్ రైడ్ చేశారు.
ప్రమాదవశాత్తు బైకు డీవైడర్ ను ఢీకొట్టింది.ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.