మాస్ మహారాజ రవితేజకు ‘కిక్ 2’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్లను ఇవ్వడంతో ఆలోచనలో పడ్డాడు.వరుసగా పరాజయాలతో సతమతం అవుతున్న రవితేజ ఆ మద్య దిల్రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో ‘ఎవడో ఒకడు’ చిత్రంలో నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
ఆ సినిమా త్వరలో చిత్రీకరణ షురూ అవ్వబోతుంది అనుకుంటున్న తరుణంలో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది అన్నారు.ఏవో కారణాల వల్ల రవితేజ స్వయంగా ఆ సినిమాను కాదన్నాడు.
ఆ తర్వాత తాజాగా తేజ దర్శకత్వంలో రవితేజ ‘అహం’ చిత్రంలో నటించనున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
రాజశేఖర్ను తప్పించి ‘అహం’ చిత్రంలో రవితేజను తేజ హీరోగా ఎంపిక చేసుకున్నాడు అని, కథ విన్న రవితేజ ‘అహం’లో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది.
అయితే తాజాగా రవితేజ తన స్నేహితుడు అయిన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.పూరి గతంలో చిరంజీవి కోసం రెడీ చేసిన ‘ఆటో జానీ’ చిత్రాన్ని రవితేజ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని సినీ వర్గాల వారు అంటున్నారు.దాంతో రవితేజ తర్వాత సినిమా ఏంటో అని ఆయన ఫ్యాన్స్తో పాటు, సినీ వర్గాల వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.