టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు.ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా మూవీ మేకర్స ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు.
ఈ ఈవెంట్లో తన మాస్ స్పీచ్తో ఆకట్టుకున్నారు రవితేజ.ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.
ఇక రవితేజ మాటలకు అభిమానులు కూడా గట్టిగా అరుస్తూ ఆ ఈవెంట్ ని మరింత సక్సెస్ఫుల్ చేశారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.ఈ సినిమాలో రేణు దేశాయ్ గారు కూడా నటించారు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు.నిర్మాత అభిషేక్ అగర్వాల్ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు.
కొత్త దర్శకుడు ఏదైనా అడిగితే డిస్కషన్స్ నడుస్తాయి.కానీ అగర్వాల్ దగ్గర అదేం లేదు.
సినిమాకి ఏం కావాలంటే అది ఇచ్చారు.అభిషేక్ అగర్వాల్ ఎంత భారీగా ఉంటారో,ఈ సినిమా కూడా అంతే భారీగా ఉంటుంది.
ఆయనతో నేను చాలా సినిమాలు చేయాలి.ఈ సినిమాతో అగర్వాల్ హ్యాట్రిక్ కొట్టాలి.
జీవీ ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.చాలా థ్రిల్ ఫీల్ అవుతారు.
సాంగ్స్ అన్నీ మీకు నచ్చాయి కదా నేను కూడా ఆ రీ సౌండ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను.
ఈ సినిమాలో నా క్యారెక్టర్ని ఇంత బాగా క్రియేట్ చేసిన దర్శకుడు వంశీ గురించి ఇప్పుడు పెద్దగా మాట్లాడను.రిలీజ్ తరువాత మాట్లాడతాను.ఒకటి మాత్రం చెప్పగలను.
అతను ఎంత బాగా చేశారో.రిలీజ్ తరువాత మీరే మాట్లాడతారు.
ఈ సినిమా అక్టోబర్ 20న థియేటర్స్లోకి వస్తుంది.మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాతో పాటు బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమా కూడా వస్తుంది.హీరో విజయ్ నటించిన లియో సినిమా కూడా వస్తుంది.
ఈ సినిమాలన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు రవితేజ.ఈ సందర్భంగా రవితేజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన సినిమాతో పాటు ఇతర హీరోల సినిమాలు కూడా బాగా హిట్ అవ్వాలి అని కోరుకోవడంతో రవితేజ మంచి మనసుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.