ఈ నెల 25వ తేదీన భీమిలిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సభలో వివరిస్తామని పేర్కొన్నారు.
సభకు సుమారు మూడు లక్షల మంది హాజరుకానున్నారని మంత్రి బొత్స తెలిపారు.క్రియాశీలక కార్యకర్తలతో నేరుగా సీఎం జగన్ మాట్లాడుతారని చెప్పారు.
అలాగే ఈనెల 21 నుంచి 23 వరకు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమని స్పష్టం చేశారు.
తమ కుటుంబ కొత్తగా ఎన్నికల బరిలో దిగడం లేదన్న మంత్రి బొత్స ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ సంకల్పమని తెలిపారు.